ప్రపంచంలో ఆయుధాల దిగుమతిలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలో జరిగే మొత్తం ఆయుధాల అమ్మకాల్లో భారత్ కొనుగోలు చేసే వాటా 10 శాతంగా ఉంది. గడిచిన ఐదేళ్లలో భారత్ ఆయుధ దిగుమతులు 38 శాతం పెరిగాయి. ఈ వివరాలను స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ) తాజా నివేదిక వెల్లడించింది. 2006-07లో ఆయుధాల దిగుమతిలో ప్రథమ స్థానంలో నిలిచిన చైనా ప్రస్తుతం నాలుగో స్థానానికి పరిమితమైందని ఎస్ఐపీఆర్ఐ పేర్కొంది.
ఎండ్రే సెమరేడీకి 2012 అబెల్ప్రైజ్
హంగేరీ గణిత శాస్త్రవేత్త ఎండ్రే సెమరేడీ 2012 సంవత్సరానికి అబెల్ ప్రైజ్కు ఎంపికైయ్యారు. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్లో చేసిన కృషికిగాను ఎండ్రేకు ఈ పురస్కారం దక్కింది. గణిత శాస్త్రంలో నోబెల్ ప్రైజ్గా వ్యవహరించే ఈ అవార్డును 2003 నుంచి నార్వే అకాడమీ ఆఫ్ సెన్సైస్ అండ్ లెటర్స్ అందజేస్తుంది. నార్వే గణిత మేధావి నీల్స్ హెన్రిన్ అబెల్ పేరిట ఈ పురస్కారాన్ని నెలకొల్పారు. దీని కింద మిలియన్ డాలర్లు బహూకరిస్తారు.
దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మార్చి 25న ఆ దేశ అధ్యక్షుడు లీమ్యూంగ్ బాక్తో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. వ్యూహాత్మక సంబంధాలను మరింత విస్తరింపజేసుకోవాలని ఈ సందర్భంగా ఇరు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. 2015 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 40 మిలియన్ డాలర్లకు పెంచాలని కూడా ఒప్పందం చేసుకున్నాయి.
మాలిలో తిరుగుబాటు
పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో అధికారం హస్తగతం చేసుకున్నట్లు మార్చి 22న ఆ దేశ సైన్యం ప్రకటించింది. సైన్యం ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి, మంత్రులను అరెస్టు చేసింది. దేశ సరిహద్దులను మూసివేసింది. ఏప్రిల్ 29న దేశంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నూతనంగా ఎన్నికయ్యే ప్రభుత్వానికి అధికారం అప్పగిస్తామని సైన్యం ప్రకటించింది. దేశ ఉత్తర ప్రాంతంలోని తురేగ్ జాతి తీవ్రవాదుల పట్ల ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని సైన్యం పేర్కొంది. మాలి ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. ఉత్తర ప్రాంతంపై దక్షిణ ప్రాంతం ఆధిపత్యం కొనసాగిస్తోంది. దీంతో 1960 నుంచి నాలుగుసార్లు తిరుగుబాట్లు జరిగాయి.
హాంకాంగ్ కొత్త అధినేత యింగ్
హాంకాంగ్ నగర చీఫ్ ఎగ్జిక్యూటివ్గా లీంగ్చున్ యింగ్ ఎన్నికయ్యారు. మార్చి 25న జరిగిన ఎన్నికల్లో యింగ్ విజయం సాధించారు. జూలైలో బాధ్యతలు చేపడతారు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో కూడిన కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ను ఎన్నుకుంటుంది. పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే ఈ పదవి అత్యున్నత రాజకీయ పదవి. హాంకాంగ్ నగరం 1997లో చైనా పరిపాలన కిందకి వచ్చింది.
జర్మనీ అధ్యక్షుడిగా జోచిమ్ గాక్ ఎన్నిక
బ్రిటానికా ఎన్సైక్లోపీడియా ప్రచురణ నిలిపివేత
బ్రిటానికా ఎన్సైక్లోపీడియా ప్రచురణను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ మార్చి 14న ప్రకటించింది. 200 ఏళ్లకు పైగా వస్తున్న ఈ ప్రచురణను నిలిపివేయడం ఇదే తొలిసారి. వీకీపీడియా లాంటి ఆన్లైన్ ఉచిత ప్రచురణలు అందుబాటులోకి రావడంతో పుస్తక ప్రచురణను నిలిపివేసి ఆన్లైన్లో అందుబాటులోకి తేవాలని బ్రిటానికా సంస్థ నిర్ణయించింది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికాను తొలిసారి 1768లో స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ నుంచి ప్రచురించారు. 1990లో అత్యధికంగా 1,20,00 సెట్లు అమ్ముడు పోయాయి.
సార్క్ సెక్రటరీ జనరల్గా అహమ్మద్ సలీం
దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) కొత్త సెక్రటరీ జనరల్గా అహమ్మద్ సలీం మార్చి 13న బాధ్యతలు స్వీకరించారు. మాల్దీవులకు చెందిన సలీం సార్క మొదటి మహిళా సెక్రటరీ జనరల్ ఫాతిమా దియానా సయీద్ స్థానంలో నియమితులయ్యారు. మాల్దీవుల క్రిమినల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా మొహమ్మద్ అరెస్టుపై ఫాతిమా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమె రాజీనామా చేశారు.
అణుపరీక్షల నిలిపివేతకు అంగీకరించిన ఉత్తర కొరియా
అణు పరీక్షలు, కార్యక్రమాల నిలిపివేత, సుదూర పరిధి క్షిపణుల అభివృద్ధిపై మారటోరియానికి ఉత్తర కొరియా అంగీకరించినట్లు ఫిబ్రవరి 29న అమెరికా తెలిపింది. దీనికి బదులుగా 2,40,000 మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలు అమెరికా అందిస్తుంది. యాంగ్బయోన్లో యురేనియం శుద్ధిని నిలిపివేయడం, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీకి కూడా ఉత్తర కొరియా అంగీకరించింది.
|
సుదీర్ఘకాలం ఉత్తర కొరియాను పాలించిన జిమ్ జోంగ్-ఇల్ 2011 డిసెంబర్లో మరణించడంతో ఉత్తర కొరియా అణు కార్యక్రమాల్ని అడ్డుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 1990లో సంభవించిన కరువు కారణంగా ఉత్తర కొరియా తీవ్ర ఆహార పదార్థాల కొరతను ఎదుర్కొంటోంది.
రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నిక
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మూడోసారి ఎన్నికయ్యారు. రష్యా అధ్య క్ష పదవికి మార్చి 4న ఎన్నికలు జరిగాయి. పుతిన్కు 64 శాతం ఓట్లు వచ్చాయి. పుతిన్ ప్రత్యర్థులు గెన్నడీ జ్యుగనోవ్కు 17.17 శాతం ఓట్లు, మరో అభ్యర్థి మైఖేల్ ప్రొఖోరోవ్కు 7.82 శాతం ఓట్లు వచ్చాయి. గత నాలుగేళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న పుతిన్ 2000-2008 మధ్య కాలంలో అధ్యక్షుడిగా కొనసాగారు.
వాంగ్ షూకు ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్
ఆర్కిటెక్చర్లో నోబెల్గా పిలిచే ‘ప్రిట్జ్కర్ ప్రైజ్’ ఈ ఏడాది చైనాకు చెందిన వాంగ్ షూ (48)కు లభించింది. ఈ అవార్డు కింద ప్రశంసా పత్రంతో పాటు లక్ష డాలర్ల నగదు బహుకరిస్తారు.