28 జూన్ - 04 జూలై 2012 అంతర్జాతీయం
అంతర్జాతీయం
అవినీతి నిరోధక టాస్క్ఫోర్స్కు
భారత్ నేతృత్వం
అవినీతి నిరోధక గ్లోబల్ టాస్క్ఫోర్స్కు భారత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) ప్రదీప్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ యాంటీ-కరప్షన్ అథారిటీస్(ఐఏఏసీఏ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అవినీతి సంబంధ నేరాలను నిర్ధారించడం, అంతర్జాతీయ సహకారం పెంపొందించేందుకు ఈ టాస్క్ఫోర్స్ పని చేస్తుంది. అవినీతి నిరోధక సంస్థలు, విధానాలు, అనుసరించే పద్ధతులు, కార్యాచరణ వంటి అంశాలకు సంబంధించిన సమాచార మార్పిడి తదితర అంశాల్లోటాస్క్ఫోర్స్ తోడ్పడుతుంది. గత ఏప్రిల్లో టాంజానియాలో నిర్వహించిన ఐఏఏసీఏ కార్యనిర్వాహక సమావేశంలో గ్లోబల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటును సీవీసీ ప్రదీప్ కుమార్ ప్రతిపాదించారు.
రతన్ టాటాకు రాక్ఫెల్లర్ అవార్డు
టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అందజేసే లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారానికి ఎంపికయ్యారు. న్యూ యార్క్లో జూన్ 27న రతన్కు ఈ అవార్డును ప్రదానం చేశారు. గతేడాది ఈ పురస్కారం అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కు దక్కింది.
ఈజిప్టు అధ్యక్షుడిగా ముర్సీ ప్రమాణం
ఈజిప్టు నూతన అధ్యక్షుడిగా మహ్మద్ ముర్సీ జూన్ 30న ప్రమాణ స్వీకారం చేశారు. ఈజిప్టులో తొలిసారి స్వేచ్ఛగా ఎన్నికైన అధ్యక్షుడిగా ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ అభ్యర్థి ముర్సీ ఘనత దక్కించుకున్నారు. ఈ విజయంతో 84 ఏళ్ల తర్వాత ముస్లిం బ్రదర్హుడ్ పార్టీకి అధికారం దక్కింది.
భూమికి చేరిన చైనా వ్యోమగాములు
చైనా తొలి మానవసహిత అంతరిక్ష అనుసంధానం పూర్తి చేసి షెంజౌ-9 వ్యోమనౌక 13 రోజుల అంతరిక్ష యాత్ర అనంతరం జూన్ 29న మంగోలియాలోని సిజివాంగ్లో దిగింది. ఇందులో తొలి మహిళా వ్యోమగామి సహా ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. 2020 నాటికి అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో భాగంగా చైనా ఈ అంతరిక్ష యాత్ర నిర్వహించింది.
లీప్ సెకన్
జూన్ 30వ తేదీన చివరి నిమిషానికి శాస్త్రవేత్తలు ఒక లీప్ సెకన్ కలిపారు. అంటే రాత్రి 11.59 గంటల తర్వాత 61 సెకన్లకు 12 అయింది. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి తనచుట్టూ తాను ఒకసారి తిరగడానికి 86,400 సెకన్లు పడుతుంది. అయితే సూర్యుడి, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి, సముద్రపు అలల కారణంగా భూభ్రమణ సమయంలో అతి స్వల్పంగా తేడా ఏర్పడుతుంది. దీంతో సౌరకాలమానంలో ఏర్పడే స్వల్ప వ్యత్యాసాలను సరిచేసేందుకే శాస్త్రవేత్తలు లీప్ సెకన్ను, లీప్ సంవత్సరాన్ని కలుపుతుంటారు. ప్రస్తుతం కాలాన్ని గణించేందుకు పరమాణు గడియారాలను ఉపయోగిస్తున్నారు. దీంతో ఒక సెకన్ కాలంలో వందల కోట్ల వంతు కాలాన్ని కూడా కచ్చితంగా లెక్కించవచ్చు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరమాణు కాలం (టీఏఐ), సౌరకాలమానానికి మధ్య ఏర్పడే స్వల్ప వ్యత్యాసాలను సరిచేసేందుకుగాను కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (యూటీసీ)ని సవరించనున్నారు. ఈ పద్ధతిని 1972 నుంచి పాటిస్తున్నారు.
ప్రపంచ వారసత్వ జాబితాలో పశ్చిమ కనుమలు
భారత్లోని పశ్చిమ కనుమలను ప్రపంచ వారసత్వ జాబితా (వరల్డ్ హెరిటేజ్ లిస్ట్)లో చేర్చాలని ది వరల్డ్ హెరిటేజ్ కమిటీ జూలై 1న నిర్ణయించింది. పశ్చిమ కనుమల్లోని 39 వరుస ప్రదేశాలకు ఈ జాబితాలో చోటు దక్కింది. గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రారంభమై 1600 కి.మీ. పొడవున మహారాష్ట్ర, గోవా,కర్ణాటక, తమిళనాడు, కేరళలలో విస్తరించి కన్యాకుమారిలో ఈ పర్వత శ్రేణులు ముగుస్తాయి. ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత జీవ వైవిధ్యం కలిగిన పది ప్రాంతాల్లో ఒకటిగా పశ్చిమ కనుమలు గుర్తింపు పొందాయి. ఈ కనుమల సముదాయాల్లో విస్తరించిన అడవులు హిమాలయా పర్వతాల కంటే పురాతనమైనవి. పశ్చిమ కనుమలతోపాటు జర్మనీలోని చారిత్రక ఒపెరా హౌస్, పోర్చుగల్లోని సరిహద్దు పట్టణం, చాద్లో ఒకదానికొకటి అనుసంధానమైన ఎనిమిది సరస్సులకు కూడా హెరిటేజ్ జాబితాలో చోటు దక్కింది. అంతేకాకుండా వెస్ట్ బ్యాంక్లోని ఏసుక్రీస్తు జన్మించిన బెత్లెహామ్ నగరాన్ని, ఆయన పుట్టినట్లు భావిస్తున్న అక్కడి ‘నేటివిటీ చర్చి’ని కూడా ప్రపంచ హెరిటేజ్ జాబితాలో చేర్చాలని యునెస్కో జూన్ 29న నిర్ణయించింది.
.......................
అవినీతి నిరోధక టాస్క్ఫోర్స్కు
భారత్ నేతృత్వం
అవినీతి నిరోధక గ్లోబల్ టాస్క్ఫోర్స్కు భారత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) ప్రదీప్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ యాంటీ-కరప్షన్ అథారిటీస్(ఐఏఏసీఏ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అవినీతి సంబంధ నేరాలను నిర్ధారించడం, అంతర్జాతీయ సహకారం పెంపొందించేందుకు ఈ టాస్క్ఫోర్స్ పని చేస్తుంది. అవినీతి నిరోధక సంస్థలు, విధానాలు, అనుసరించే పద్ధతులు, కార్యాచరణ వంటి అంశాలకు సంబంధించిన సమాచార మార్పిడి తదితర అంశాల్లోటాస్క్ఫోర్స్ తోడ్పడుతుంది. గత ఏప్రిల్లో టాంజానియాలో నిర్వహించిన ఐఏఏసీఏ కార్యనిర్వాహక సమావేశంలో గ్లోబల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటును సీవీసీ ప్రదీప్ కుమార్ ప్రతిపాదించారు.
రతన్ టాటాకు రాక్ఫెల్లర్ అవార్డు
టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అందజేసే లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారానికి ఎంపికయ్యారు. న్యూ యార్క్లో జూన్ 27న రతన్కు ఈ అవార్డును ప్రదానం చేశారు. గతేడాది ఈ పురస్కారం అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కు దక్కింది.
ఈజిప్టు అధ్యక్షుడిగా ముర్సీ ప్రమాణం
ఈజిప్టు నూతన అధ్యక్షుడిగా మహ్మద్ ముర్సీ జూన్ 30న ప్రమాణ స్వీకారం చేశారు. ఈజిప్టులో తొలిసారి స్వేచ్ఛగా ఎన్నికైన అధ్యక్షుడిగా ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ అభ్యర్థి ముర్సీ ఘనత దక్కించుకున్నారు. ఈ విజయంతో 84 ఏళ్ల తర్వాత ముస్లిం బ్రదర్హుడ్ పార్టీకి అధికారం దక్కింది.
భూమికి చేరిన చైనా వ్యోమగాములు
చైనా తొలి మానవసహిత అంతరిక్ష అనుసంధానం పూర్తి చేసి షెంజౌ-9 వ్యోమనౌక 13 రోజుల అంతరిక్ష యాత్ర అనంతరం జూన్ 29న మంగోలియాలోని సిజివాంగ్లో దిగింది. ఇందులో తొలి మహిళా వ్యోమగామి సహా ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. 2020 నాటికి అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో భాగంగా చైనా ఈ అంతరిక్ష యాత్ర నిర్వహించింది.
లీప్ సెకన్
జూన్ 30వ తేదీన చివరి నిమిషానికి శాస్త్రవేత్తలు ఒక లీప్ సెకన్ కలిపారు. అంటే రాత్రి 11.59 గంటల తర్వాత 61 సెకన్లకు 12 అయింది. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి తనచుట్టూ తాను ఒకసారి తిరగడానికి 86,400 సెకన్లు పడుతుంది. అయితే సూర్యుడి, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి, సముద్రపు అలల కారణంగా భూభ్రమణ సమయంలో అతి స్వల్పంగా తేడా ఏర్పడుతుంది. దీంతో సౌరకాలమానంలో ఏర్పడే స్వల్ప వ్యత్యాసాలను సరిచేసేందుకే శాస్త్రవేత్తలు లీప్ సెకన్ను, లీప్ సంవత్సరాన్ని కలుపుతుంటారు. ప్రస్తుతం కాలాన్ని గణించేందుకు పరమాణు గడియారాలను ఉపయోగిస్తున్నారు. దీంతో ఒక సెకన్ కాలంలో వందల కోట్ల వంతు కాలాన్ని కూడా కచ్చితంగా లెక్కించవచ్చు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరమాణు కాలం (టీఏఐ), సౌరకాలమానానికి మధ్య ఏర్పడే స్వల్ప వ్యత్యాసాలను సరిచేసేందుకుగాను కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (యూటీసీ)ని సవరించనున్నారు. ఈ పద్ధతిని 1972 నుంచి పాటిస్తున్నారు.
ప్రపంచ వారసత్వ జాబితాలో పశ్చిమ కనుమలు
భారత్లోని పశ్చిమ కనుమలను ప్రపంచ వారసత్వ జాబితా (వరల్డ్ హెరిటేజ్ లిస్ట్)లో చేర్చాలని ది వరల్డ్ హెరిటేజ్ కమిటీ జూలై 1న నిర్ణయించింది. పశ్చిమ కనుమల్లోని 39 వరుస ప్రదేశాలకు ఈ జాబితాలో చోటు దక్కింది. గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రారంభమై 1600 కి.మీ. పొడవున మహారాష్ట్ర, గోవా,కర్ణాటక, తమిళనాడు, కేరళలలో విస్తరించి కన్యాకుమారిలో ఈ పర్వత శ్రేణులు ముగుస్తాయి. ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత జీవ వైవిధ్యం కలిగిన పది ప్రాంతాల్లో ఒకటిగా పశ్చిమ కనుమలు గుర్తింపు పొందాయి. ఈ కనుమల సముదాయాల్లో విస్తరించిన అడవులు హిమాలయా పర్వతాల కంటే పురాతనమైనవి. పశ్చిమ కనుమలతోపాటు జర్మనీలోని చారిత్రక ఒపెరా హౌస్, పోర్చుగల్లోని సరిహద్దు పట్టణం, చాద్లో ఒకదానికొకటి అనుసంధానమైన ఎనిమిది సరస్సులకు కూడా హెరిటేజ్ జాబితాలో చోటు దక్కింది. అంతేకాకుండా వెస్ట్ బ్యాంక్లోని ఏసుక్రీస్తు జన్మించిన బెత్లెహామ్ నగరాన్ని, ఆయన పుట్టినట్లు భావిస్తున్న అక్కడి ‘నేటివిటీ చర్చి’ని కూడా ప్రపంచ హెరిటేజ్ జాబితాలో చేర్చాలని యునెస్కో జూన్ 29న నిర్ణయించింది.
.......................
అంతర్జాతీయం(21-27 జూన్)
అంతర్జాతీయంగ్రీస్ ప్రధానిగా సమరస్
గ్రీస్ నూతన ప్రధానమంత్రిగా న్యూడెమోక్రసీ పార్టీ అధ్యక్షుడు అంటోనిస్ సమరస్ జూన్ 20న ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 17న జరిగిన ఎన్నికల్లో 29.7 శాతం ఓట్లు సాధించి న్యూడెమోక్రసీ పార్టీ పార్లమెంట్లో అతి పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారీటీ రాలేదు. దీంతో పసోక్ పార్టీ, డెమోక్రటిక్ లెఫ్ట్ అనే మరో రెండు పార్టీలతో కలిసి న్యూడెమోక్రసీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
సూకీకి ఆక్స్ఫర్డ్ డాక్టరేట్
మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీకి బ్రిటన్లోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జూన్ 20న గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. సూకీ 1967లో ఈ యూనివర్సిటీ నుంచి ఆర్థిక, రాజనీతి, తత్వశాస్త్రాల్లో డిగ్రీ పూర్తిచేశారు. ఐర్లాండ్ ప్రజలు ‘ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ డబ్లిన్’ పురస్కారంతో కూడా ఆమెను సత్కరించారు.
మెక్సికోలో జీ-20 ఏడో సదస్సు
జీ-20 దేశాల సదస్సు ఏడో సదస్సు జూన్ 18-19 తేదీల్లో మెక్సికోలోని లాక్ కాబోస్లో జరిగింది. ఈ సందర్భంగా సదస్సు డిక్లరేషన్ను విడుదల చేశారు. ఆర్థిక విపణుల ఒడిదుడుకుల పరిష్కారంలో, వాణిజ్యాన్ని ప్రోత్సహించటంలో, ఉద్యోగాలను పెంచటంలో ఉమ్మడి చర్యలు చేపట్టాలని సదస్సు పిలుపునిచ్చింది.
ఐఎంఎఫ్ను బలోపేతం చేస్తూ సమకూర్చనున్న 450 బిలియన్ డాలర్లలో ఐదు దేశాల కూటమి ‘బ్రిక్స్’ 75 డాలర్లు అందించేందుకు సమ్మతించగా.. అందులో 10 బిలియన్ డాలర్లు భారత్ సమకూర్చనుంది. యూరోజోన్లో అస్థిరతను పరిష్కరించాలని సదస్సుకు హాజరైన నాయకులంతా అంగీకరించారు. ఐఎంఎఫ్ కోటా సంస్కరణలు చాలా నెమ్మదిగా సాగుతుండటం పట్ల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కోటాలు ఆర్థిక బలాలను సరళంగా, పారదర్శకంగా ప్రతిబింబించాలన్నారు. కోటా సంస్కరణలు పూర్తయితే.. ఐఎంఎఫ్లో భారత్ వాటా ప్రస్తుతం ఉన్న 2.44 శాతం నుంచి 2.75 శాతానికి పెరుగుతుంది. తద్వారా.. ప్రస్తుతం ఐఎంఎఫ్ వాటా దారుల్లో 11వ అతి పెద్ద వాటాదారుగా ఉన్న భారత్ స్థానం 8వ స్థానానికి పెరుగుతుంది. జీ-20 దేశాల తదుపరి సదస్సు 2013లో రష్యాలో జరుగుతుంది.
అంతరిక్ష రంగంలో చైనా మాన్యువల్ డాకింగ్
అంతరిక్ష రంగంలో చైనా జూన్ 24న ‘మానవ ప్రమేయ అనుసంధానం(మాన్యువల్ డాకింగ్)’ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో 2020 నాటికి తొలి స్పేస్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలన్న దిశగా ముందడుగు వేసినట్లయింది. చైనా తొలి మహిళా వ్యో మగామి లియు యాంగ్ సహా షెంజౌ-9లో ఉన్న ముగ్గురు వ్యోమగాములు తియాంగాంగ్-1 మాడ్యుల్తో విజయవంతంగా అనుసంధానమయ్యారు. ఇది తొలి ప్రయోగాత్మక మాన్యువల్ డాకింగ్.
రియోలో ధరిత్రీ సదస్సు
ఐక్యరాజ్యసమితి ‘రియో+20’పేరిట ధరిత్రీ శిఖరాగ్ర సదస్సును బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జూన్ 20-22వ తేదీల్లో నిర్వహించింది. ‘‘సుస్థిరాభివృద్ధి, పేదరిక నిర్మూలన నేపథ్యంలో హరిత ఆర్థిక వ్యవస్థ-సుస్థిరాభివృద్ధి కోసం వ్యవస్థాపరమైన కార్యాచరణ’’ అనే ఇతివృత్తింతో జరిగిన ఈ సదస్సును ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రారంభించారు. ఇందులో 191 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ద ఫ్యూచర్ వియ్ వాంట్’ ముసాయిదా పత్రాన్ని ఆమోదించారు.
ఆకలి నుంచి ప్రజలను కాపాడేందుకు ‘జీరో హంగర్ ఛాలెంజ్’ అనే కార్యక్రమాన్ని బాన్ కీ మూన్ ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం.. సంవత్సరమంతా చాలినంత ఆహారం అందుబాటులోకి తేవడంలో 100 శాతం విజయం, గర్భిణులు-చిన్నపిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణ, సుస్థిర ఆహార వ్యవస్థ ఏర్పాటు, ఉత్పాదకతలో, ఆదాయంలో ముఖ్యంగా మహిళ ఆదాయంలో వృద్ధిని పెంచడం, ఆహార వృధాను సున్నా స్థాయికి తగ్గించడం వంటి లక్ష్యాలతో పని చేస్తుంది.
‘గ్రీన్ ఎకానమీ’ పేరిట అగ్రరాజ్యాలు ఇతర దేశాలపై ఏకపక్షంగా విధిస్తున్న వాణిజ్యపరమైన ఆంక్షలను భారత్ తోసిపుచ్చింది. భారత్ ప్రతిపాదన మేరకు సాంకేతిక బదలాయింపు, ఆర్థిక అంశాలపై తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు సదస్సు అంగీకారం తెలిపింది. సదస్సుకు హాజరైన ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా చైనా ప్రధాని వెన్ జియబావోతో ముఖాముఖి చర్చలు జరిపారు. రియోలో తొలి ధరిత్రీ సదస్సు జరిగిన 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడే ఈ సదస్సు జరగడం విశేషం. 1992లో నిర్వహించిన ధరిత్రీ సదస్సులో 172 దేశాలు పాల్గొన్నాయి.
ఈజిప్టు అధ్యక్షుడిగా మహ్మద్ ముర్సీ
ఈజిప్టు అధ్యక్షుడిగా ముస్లిం బ్రదర్హుడ్ అభ్యర్థి మహ్మద్ ముర్సీ విజయం సాధించారు. ముబారక్ పదవి కోల్పోయాక అధ్యక్ష పదవి కోసం జూన్ 16,17 తేదీల్లో జరిగిన ఎన్నికల్లో ముర్సీకి 51.73 శాతం ఓట్లు రాగా ప్రత్యర్ధి షఫీక్(ముబారక్ హయాంలో చివరి ప్రధాని)కు 48.3 శాతం ఓట్లు దక్కాయి.
ఆరు దశాబ్దాల ముబారక్ నియంతృత్వ పాలనపై గతేడాది జనవరి 25న ప్రారంభమైన తిరుగుబాటు ఫిబ్రవరి 11న ఆయన పదవి నుంచి వైదొలగడంతో ముగిసింది. అప్పటి నుంచి సైనిక బలగాల అత్యున్నత మండలి ఈజిప్టు పాలన కొనసాగిస్తోంది.
పాక్ ప్రధానిపై అనర్హత వేటు
పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ కోర్టు ధిక్కారం కేసులో దోషిగా నిర్ధారితుడైనందున.. ప్రధానమంత్రి పదవికి అనర్హుడయ్యాడని ఆ దేశ సుప్రీం కోర్టు జూన్ 19న పేర్కొంది. గిలానీ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడయ్యాడని, ప్రధాని పదవి గత రెండు నెలలుగా ఖాళీగా ఉన్నట్లేనని కోర్టు వ్యాఖ్యానించింది.
దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీపై స్విట్జర్లాండ్ ముడుపుల కేసును తిరగదోడాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తిరస్కరించినందుకుగాను.. ప్రధాని గిలానీని కోర్టు ధిక్కారం కేసులో దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు గత ఏప్రిల్ 26న తీర్పునిచ్చింది. ఆ సందర్భంగా గిలానీకి ప్రతీకాత్మకంగా ఒక నిమిషం పాటు శిక్షను కూడా విధించింది. పాక్ రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా కేసులో దోషిగా నిర్ధారితుడై శిక్షకు గురైన వ్యక్తి ప్రధానమంత్రి పదవికి అనర్హుడు.
నూతన ప్రధానిగా రజాపర్వేజ్ అష్రాఫ్
పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రిగా అధికార పక్షం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అభ్యర్థి రజాపర్వేజ్ అష్రాఫ్ జూన్ 22న ఎన్నికయ్యారు.
అంతర్జాతీయం(14-20 జూన్)
అంతర్జాతీయంఅమెరికా అప్పీళ్ల కోర్టు జడ్జిగా భారతీయుడు
అమెరికాలో రెండో అత్యున్నత న్యాయస్థానంగా గుర్తింపు పొందిన అమెరికా అప్పీళ్ల కోర్టు జడ్జిగా భారత్కు చెందిన శ్రీకాంత్ శ్రీనివాసన్ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబమా నియమించారు. ప్రస్తుతం శ్రీనివాసన్ అమెరికా డిప్యూటీ సొలిసిటర్ జనరల్గా కొనసాగుతున్నారు. ఈయన చండీగఢ్లో జన్మించారు. తర్వాత శ్రీనివాసన్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. స్టాన్ఫర్డ్ లా స్కూల్ నుంచి న్యాయ శాస్త్రం అభ్యసించారు.
డేనియల్ హిల్లేల్కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్
ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాక్టర్ డేనియల్ హిల్లేల్కు 2012 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లభించింది. వ్యవసాయ రంగంలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఉన్న ప్రాధాన్యతపై ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది. గత ఐదు దశాబ్దాలుగా వ్యవ సాయంలో నీటి సమర్ధ వినియోగం, పంట దిగుబడి పెంచడం, పర్యావరణ క్షీణత తగ్గించడం వంటి అంశాలపై డేనియల్ విశేషంగా కృషి చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్, ఇతర ప్రాంతాల్లో ఆహార ఉత్పత్తిలో విప్లవం తీసుకొచ్చారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ నోర్మన్ బోర్లాగ్ ఏర్పాటు చేశారు. ఆహార, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, పౌష్టికాహారం, మార్కెటింగ్, పేదరిక నిర్మూలన, రాజకీయ నాయకత్వం, సామాజిక శాస్త్రాల్లో కృషి చేసిన వారికి ఈ అవార్డు బహూకరిస్తారు.
అఫ్ఘానిస్థాన్పై అంతర్జాతీయ సదస్సు
అఫ్ఘానిస్థాన్ సమస్య పరిష్కారంతోపాటు ప్రాంతీయ సహకారం పెంపొందించే దిశగా చేపట్టాల్సిన చర్యలను సూచించడం కోసం జూన్ 14న కాబూల్లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఇందులో భారత్, చైనా, రష్యా సహా 30 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 2014 లో నాటో దళాలు అఫ్ఘానిస్థాన్ నుంచి విరమించుకోనున్న నేపథ్యంలో ప్రాంతీయ తోడ్పాటు అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. తీవ్రవాదం, మాదకద్రవ్యాల రవాణాపై పోరాడేందుకు వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. సదస్సులో భారత ప్రతినిధిగా కేంద్ర న్యాయ, మైనార్టీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పాల్గొన్నారు.
ఇరాన్ ఆంక్షల నుంచి భారత్కు మినహాయింపు
ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై విధించే ఆర్థిక ఆంక్షల విషయంలో భారత్సహా ఏడు దేశాలకు అమెరికా మినహాయింపునిచ్చింది. ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులను భారత్, మలేషియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, టర్కీ, తైవాన్లు గణనీయంగా తగ్గించుకున్నాయని దాంతో ఆంక్షల నుంచి వీటికి మినహాయింపునిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
రోదసిలోకి చైనా మహిళ
చైనా జూన్ 16న తన తొలి మహిళా వ్యోమగామి లియు యాంగ్ను అంతరిక్షానికి పంపింది. దీంతో అమెరికా, రష్యాల తర్వాత రోదసీలో మానవ సహిత డాకింగ్ (అనుసంధానం) నిర్వహించిన మూడో దేశంగానూ చైనా రికార్డు సృష్టించనుంది. వాయవ్య చైనాలోని గోబి ఎడారిలో గల జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి షెంర-9 వ్యోమనౌక (దేవుడి వాహనం అని అర్థం) ద్వారా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపినట్లు చైనా ప్రకటించింది. లియు ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్ పైలట్గా పనిచేశారు. చైనా తొలి మహిళా ఆస్ట్రోనాట్ కావడంతోపాటు అంతరిక్షంలోకి వెళ్లిన 57వ మహిళగా లియు రికార్డు సృష్టించారు. ఈమెతోపాటు పురుష వ్యోమగాములు జింగ్ హైపెంగ్, లియు వాంగ్లు షెంర-9లో అంతరిక్షానికి వెళ్లారు. రోదసీలో శాశ్వత స్థావరం దిశగా అమెరికా, రష్యాల తర్వాత సొంత అంతరిక్ష కేంద్రం (తియాంగాంగ్-1)ను ఏర్పాటు చేసుకుంటున్న మూడో దేశంగా చైనా అవతరించింది. ఈ ప్రయోగం కోసం ఉపయోగించిన రాకెట్ చైనా ఇంతవరకు రూపొందించిన రాకెట్లలోకెల్లా పొడవైనది, బరువైనది కావడం విశేషం. షెంర-9ను తియాంగాంగ్-1కు అనుసంధానం చేయడంతోపాటు ఈ ముగ్గురూ వ్యోమనౌక నుంచి బయటికి వచ్చి తియాంగాంగ్లోకి వెళతారు.
గ్రీస్ ఎన్నికల్లో న్యూ డెమోక్రసీ విజయం
గ్రీస్ పార్లమెంట్ ఎన్నికల్లో న్యూ డెమోక్రసీ పార్టీ విజయం సాధించింది. 29.7 శాతం ఓట్లతో న్యూ డెమోక్రసీ 79 సీట్లను గెలుచుకుంది. 26.9 శాతం ఓట్లతో అతివాద వామపక్షం సిరిజా 71 స్థానాలను దక్కించుకని రెండో స్థానంలో నిలిచింది. గ్రీస్ ఎన్నికల విధానం ప్రకారం ఎక్కువసీట్లు సాధించిన పార్టీకి బోనస్గా 50 సీట్లు లభిస్తాయి. దీంతో న్యూ డెమోక్రసీకి మొత్తం 129 సీట్లు వచ్చాయి. పార్లమెంట్లో బోనస్ సీట్లతో కలిపి 300 స్థానాలు ఉంటాయి. ఆర్థిక ఉద్దీపనల అనుకూల న్యూ డెమోక్రసీ విజయంతో యూరో జోన్ సంక్షోభంతో సతమతమవుతున్న యూరప్కు తాత్కాలిక ఉపశమనం కలిగింది. ఉద్దీపనలను, పొదుపు చర్యలను వ్యతిరేకించే సిరిజా ఎన్నికల్లో గెలిస్తే గ్రీస్ను యూరో కరెన్సీ జోన్ నుంచి బయటకు తెస్తుందని, దీంతో ఆ దేశానికి అప్పులిచ్చిన దేశాలతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశీలకులు అంచనా వేశారు. గత నెల 6నజరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో తిరిగి జూన్ 17న ఎన్నికలు నిర్వహించారు.
ఇల్లినాయిన్ వర్సిటీ వీసీగా మిత్రా దత్తా
అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇల్లినాయిస్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా భారతీయ అమెరికన్ మిత్రా దత్తా నియమితులయ్యారు. ఈమె గౌహతీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ(ఫిజిక్స్) చేశారు.
ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్గా ఫతౌ బెన్సౌరా
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) నూతన చీఫ్ ప్రాసిక్యూటర్గా గాంబియన్ న్యాయవాది ఫతౌ బెన్సౌరా జూన్ 16న ప్రమాణ స్వీకారం చేశారు. ఐసీసీ ప్రాసిక్యూటర్ల టీమ్కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళ, మొదటి ఆఫ్రికన్ బెన్సౌరా.
21 ఏళ్ల తర్వాత సూకీ నోబెల్ ప్రసంగం
మయన్మార్ ప్రజాసామ్య ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ తన నోబెల్ శాంతి బహుమతి ప్రసంగాన్ని 21 ఏళ్ల తర్వాత జూన్ 16న ఇచ్చారు. నార్వే రాజధాని ఓస్లోలోని సిటీ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సూకీ ప్రసంగిస్తూ.. ‘ఈ బహుమతి నన్ను ఒంటరితనం నుంచి బయటపడేసి, మానవ ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఆనాటి జుంటా పాలనలోని బర్మాలో ప్రజాస్వామ్య, మానవ హక్కుల కోసం సాగిన పోరాటంపైకి ప్రపంచ దృష్టిని మళ్లించింది’ అని చెప్పారు. సూకీకి 1991లో నోబెల్ తి బహుమతి ప్రకటించారు. అప్పుడు ఆమె గృహనిర్బంధంలో ఉండడంతో..సూకీ తరఫున ఆమె భర్త మైఖేల్ అరిస్, కొడుకులు కిమ్, అలెగ్జాండర్లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
అంతర్జాతీయం(07-13 జూన్)
బీజింగ్లో 12వ ఎస్సీఓ సదస్సు
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 12వ సదస్సు 2012 జూన్ 6,7 తేదీల్లో చైనా రాజధాని బీజింగ్లో జరిగింది. ఈ సదస్సులో భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ పాల్గొన్నారు. భారత్కు ఎస్సీవోలో పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించాలని ఈ సందర్భంగా కృష్ణ విజ్ఞప్తి చేశారు. 2001లో ఏర్పడిన షాంఘై సహకార సంస్థలో చైనా, రష్యా, కజకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్ పూర్తి స్థాయి సభ్యత్వం కలిగి ఉన్నాయి. భారత్, పాకిస్థాన్, ఇరాన్, మంగోలియా దేశాలకు పరిశీలక హోదా ఉంది. శ్రీలంక, బెలారస్ దేశాలు చర్చల భాగస్వాములుగా ఉన్నాయి.
శుక్ర గ్రహం అంతర్యానంషాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 12వ సదస్సు 2012 జూన్ 6,7 తేదీల్లో చైనా రాజధాని బీజింగ్లో జరిగింది. ఈ సదస్సులో భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ పాల్గొన్నారు. భారత్కు ఎస్సీవోలో పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించాలని ఈ సందర్భంగా కృష్ణ విజ్ఞప్తి చేశారు. 2001లో ఏర్పడిన షాంఘై సహకార సంస్థలో చైనా, రష్యా, కజకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్ పూర్తి స్థాయి సభ్యత్వం కలిగి ఉన్నాయి. భారత్, పాకిస్థాన్, ఇరాన్, మంగోలియా దేశాలకు పరిశీలక హోదా ఉంది. శ్రీలంక, బెలారస్ దేశాలు చర్చల భాగస్వాములుగా ఉన్నాయి.
సూర్యుని మీదుగా జూన్ 6న శుక్ర గ్రహం ప్రయాణించింది. సూర్యునిపై నల్లటి మచ్చలా శుక్ర గ్రహం భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. భూమికి, సూర్యుడికి మధ్య సరళరేఖపైకి శుక్ర గ్రహం రావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. సైన్స్ పరంగా చూస్తే ఈ ప్రక్రియ శుక్ర గ్రహణమే (అంతర్యానం). చివరి శుక్ర అంతర్యానం జూన్ 8, 2004లో ఏర్పడింది.
ఇలాంటి సంఘటనలు తిరిగి 105 సంవత్సరాల తర్వాత, ఎనిమిదేళ్ల వ్యవధిలో రెండుసార్లు (2117, 2125లలో) చోటు చేసుకుంటాయి. సాధారణంగా శుక్ర గ్రహం అంతర్యానం 121 సంవత్సరాలకు ఒకసారి, తర్వాత ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి, తర్వాత 105 సంవత్సరాలకు, తర్వాత ఎనిమిది సంవత్సరాలకు ఒక సారి సంభవిస్తుంది.
హతాఫ్-7ను పరీక్షించిన పాక్
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హతాఫ్-7 అణు క్షిపణిని పాకిస్థాన్ జూన్ 5న విజయవంతంగా పరీక్షించింది. శత్రు రాడార్ల కళ్లుగప్పి తక్కువ ఎత్తులో దూసుకెళ్లే ఈ క్షిపణి సుమారు 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్లోని పలు కీలక ప్రాంతాలు హతాఫ్-7 పరిధిలోకి వస్తాయి. అగ్ని-5 ఖండాతర అణు క్షిపణిని భారత్ పరీక్షించిన కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్థాన్ ఐదు సార్లు వివిధ శ్రేణులకు చెందిన పలు రకాల హతాఫ్ క్షిపణులను పరీక్షించింది.
నోబెల్ అవార్డు నగదు తగ్గింపు
నోబెల్ బహుమతి కింద విజేతలకు ఇచ్చే నగదు బహుమతిని 20 శాతం తగ్గించినట్లు జూన్ 11న నోబెల్ ఫౌండేషన్ ప్రకటించింది. 2001 నుంచి విజేతలకు కోటి స్వీడిష్ క్రోనార్లు (రూ.7.84 కోట్లు) చెల్లిస్తుండగా, 2012 నుంచి విజేతలకు 80 లక్షల స్వీడిష్ క్రోనార్లు(రూ.6.26 కోట్లు) చెల్లించనున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫౌండేషన్ ప్రకటించింది. డైనమేట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట నోబెల్ అవార్డులను 1900లో ఏర్పాటు చేశారు. వైద్యం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి, అర్థశాస్త్రం వంటి రంగాల్లో కృషి చేసినవారికి వీటిని ప్రతి ఏటా ప్రదానం చేస్తారు.
అంతర్జాతీయం
ప్రధాని మయన్మార్ పర్యటన
భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మే 27 నుంచి మూడు రోజుల పాటు మయన్మార్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు థీన్సీన్తో సమావేశమయ్యారు. ఇరువురు నేతల సమక్షంలో మే 28న రెండు దేశాల మధ్య పలు అంశాలకు సంబంధించి 12 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో 500 మిలియన్ డాలర్ల రుణం, వాయు సేవలు, ఇరు దేశాల సరిహద్దు ప్రాంత అభివృద్ధి, ఉమ్మడి వాణిజ్యం, పెట్టుబడి ఫోరమ్ ఏర్పాటు, వ్యవసాయ పరిశోధన వంటి అంశాలు ఉన్నాయి. ఈ పర్యటనలో మన్మోహన్ సింగ్ ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్సాన్ సూకీతో కూడా సమావేశమయయ్యారు. గత 25 సంవత్సరాల్లో మయన్మార్లో పర్యటించిన తొలి భారత ప్రధాని మన్మోహన్ సింగ్.
లైబీరియా మాజీ అధ్యక్షుడు చార్లెస్ టేలర్కు లీడ్షెండమ్ (నెదర్లాండ్స్)లోని అంతర్జాతీయ యుద్ధ నేరాల కోర్టు మే 30న 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సరిహద్దు దేశం సియోర్రా లియోన్లో 1991-2001 మధ్య జరిగిన అంతర్యుద్ధం సందర్భంగా తిరుగుబాటుదారులకు ఆయుధాలు అందించడంతోపాటు వారిని అమానుషకాండకు పురిగొల్పారన్న అభియోగాలపై ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. ఈ అంతర్యుద్ధంలో దాదాపు 50 వేల మంది మరణించారు. రెబెల్స్కు ఆయుధాలిచ్చిన టేలర్ అందుకు ప్రతిగా వారి నుంచి బ్లడ్డైమండ్స్ (యుద్ధప్రాంతంలో తవ్వితీసిన వజ్రాలు)ను ముడుపులుగా తీసుకున్నారని ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని కోర్టు ధ్రువీకరించింది. నూరెంబర్గ్లో 1946లో నాజీల దురాగతాలపై విచారణ అనంతరం.. ఒక దేశ మాజీ అధ్యక్షుడిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో మళ్లీ విచారణ జరగడం ఇదే తొలిసారి.
స్పెల్లింగ్ బీ విజేత స్నిగ్ధ నందిపాటి
అమెరికాలో జరిగిన ‘స్పెల్లింగ్ బీ’ పోటీలో భారత సంతతి (ప్రవాసాంధ్ర కుటుంబానికి చెందిన) కి చెందిన స్నిగ్ధ నందిపాటి విజేతగా నిలిచింది. మే 31న జరిగిన పోటీలో చాలా కఠినమైన ఆంగ్లపదాలకు స్పెల్లింగ్ను చెప్పినందుకుగాను కాలిఫోర్నియాకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని స్నిగ్ధ ఈ ట్రోఫీని గెలుపొందింది. ఫ్రెంచ్ పదం గెటాపెన్స్ (జఠ్ఛ్ట్చఞ్ఛట)కు సరైన సమాధానం చెప్పడం ద్వారా ఈ విజయం సాధించింది.
హతాఫ్ క్షిపణిని పరీక్షించిన పాక్
అణ్వస్త్ర సామర్థ్యం గల హతాఫ్-8 క్రూయిజ్ క్షిపణిని పాకిస్థాన్ మే 31న విజయవంతంగా పరీక్షించింది. సుమారు 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి పరిధిలో భారత్లోని పలు ప్రాంతాలు ఉన్నాయి.
మిడిల్ ఈస్ట్ లక్ష్యంగా ‘ప్లేమ్’ కంప్యూటర్ వైరస్
మిడిల్ ఈస్ట్ దేశాలైన ఇజ్రాయెల్, లెబనాన్, సిరియా, ఇరాన్, ఈజిప్టు, సూడాన్, సౌదీ అరేబియాలోని 5000 వరకు కంప్యూటర్లు ‘ప్లేమ్’ వైరస్ బారిన పడ్డాయి. 2010 లో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కు సోకిన ‘స్టుక్స్ నెట్’ కంటే ఇది 20 రెట్లు సంక్లిష్టమైంది. ఇది లక్ష్యంగా నిర్ణయించిన సంస్థల సమాచారాన్ని వివిధ రకాలుగా సేకరిస్తుంది. లోకల్ నెట్వర్క్ హార్డ్ డ్రైవ్లను స్కాన్, శబ్దాలను రికార్డు చేస్తుంది. బ్లూటూత్ ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థను అందుకుంటుంది. సేవ్ చేసిన సమాచారాన్ని ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాల్లోని 80 సర్వర్లకు అందజేస్తుంది.
టమోటో జన్యు క్రమాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
టమోటో జన్యు క్రమాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బయోటెక్నాలజీలో అతి పెద్ద ముందడుగుగా దీన్ని భావిస్తున్నారు. భారత్తోపాటు వివిధ దేశాలకు చెందిన సుమారు 300 మంది శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. దీని వల్ల ఆవిష్కరణ ఖర్చు తగ్గడంతోపాటు వేగంగా ఉత్పత్తి సాధించేందుకు, చీడ పీడలను, కరువు తట్టుకునే టమోటో వంగడాల ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఈ ప్రయోగాలు ఇతర పంటల ఉత్పాదకతను కూడా పెంచేందుకు తోడ్పడుతాయి.
ముబారక్కు జీవిత ఖైదు
ఈజిప్టును మూడు దశాబ్దాలపాటు నిరంకుశంగా పాలించిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్కు న్యూకైరోలోని ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. తన పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఉద్యమకారులను దారుణంగా చంపిన కేసులో ముబారక్ను కోర్టు దోషిగా ప్రకటించింది. 2011 జనవరి, ఫిబ్రవరిలలో ముబారక్కు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై ప్రభుత్వ దళాలు జరిపిన దాడుల్లో దాదాపు 850 మంది మరణించారు. కమాండర్గా కదనరంగంలో పోరాడిన ముబారక్ అంచెలంచెలుగా ఎదిగారు. 1981లో నాటి అధ్యక్షుడు సాదత్ హత్య తర్వాత అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రజా ఉద్యమాల ఫలితంగా గద్దె