July - 2012

2- 18 జూలై 2012
జాతీయం
కర్ణాటక ముఖ్యమంత్రిగా జగదీశ్ శెట్టర్
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా జగదీశ్ శెట్టర్ జూలై 12న ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రితోపాటు కె.ఎస్. ఈశ్వరప్ప ఆర్. ఆశోక్‌లను ఉపముఖ్యమంత్రులుగా నియమించారు. 2008లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శెట్టర్ మూడో ముఖ్యమంత్రి. రాష్ట్రానికి 21వ ముఖ్యమంత్రి.
దేశంలో తొలి ఫుడ్‌పార్‌‌క ప్రారంభం
దేశంలో నెలకొల్పిన తొలి మెగాఫుడ్ పార్‌‌కను చిత్తూరు జిల్లా మొగిలి వద్ద కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్‌పవార్ జూలై 9న ప్రారంభించారు. 147 ఎకరాల్లో నెలకొల్పిన ఈ శ్రీనిఫుడ్ పార్‌‌కలో విత్తనాల నుంచి తుది వినియోగం వరకు అవసరమైన అన్ని ఆధునిక సదుపాయాలు కల్పించారు. ఇందులో ఫుడ్ ప్రాసెస్ చేసేవారికి, వ్యవసాయ దారులకు, రిటైలర్లకు, ఎగుమతిదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దేశంలో మంజూరైన 10 ఫుడ్ పార్కుల్లో ఇదే మొదట పనిచేయడం ప్రారంభించింది.
నటుడు దారాసింగ్ మృతి
బాలీవుడ్ తొలితరం హీరో, మల్లయోధుడు దారాసింగ్ (84) ముంబైలో జూలై 12న మరణించారు. ఆయన తొలిసారి 1952 సంగ్‌దిల్ చిత్రంలో నటించగా చివరిసారిగా 2007లో జబ్ వుయ్ మెట్ చిత్రంలో నటించారు. ఆయన టీవీ సీరియల్ రామాయణంలో
హనుమంతుడిగా మంచి పేరు గడించారు.
అత్యుత్తమ వాణిజ్య నగరంగా ఢిల్లీ
ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ (ఐఎఫ్‌సి) అనే అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన అత్యుత్తమ వాణిజ్య నగరాల జాబితాలో దేశంలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా తర్వాత స్థానాలను ద క్కించుకున్నాయి . గిరాకీ, పోటీ సామర్థ్యం, పరిశ్రమలు అనుసరిస్తున్న ప్రమాణాలు అనే నాలుగు అంశాల ఆధారంగా ఐఎఫ్‌సి జాబితా రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే న్యూయార్‌‌క, లండన్‌లు మొదటి , రెండో స్థానాల్లో నిలిచిచాయి
ఎల్‌టీటీఈపై నిషేధం పొడిగింపు
లిబరేషన్ టైగర్‌‌స ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్‌టీటీఈ)పై 2014 మార్చి 31 వరకు భారత ప్రభుత్వం నిషేధం పొడిగించింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను జూలై 14న విడుదల చేసింది. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత కేంద్రం ఎల్‌టీటీఈపై నిషేధం విధించింది. 2009 శ్రీలంక దళాలు ఆ సంస్థ అధిపతి ప్రభాకరన్‌ను మట్టు బెట్టడంతో ఎల్‌టీటీఈ పూర్తిగా దెబ్బతింది. ఎల్‌టీటీఈ ఇంకా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని, దానివల్ల ప్రజల భద్రతకు ముప్పు ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.

04- 11 జూలై 2012
ఫోర్బ్స్ జాబితాలో 8 భారతీయ కంపెనీలు
2012 సంవత్సరానికి ‘ఫోర్బ్స్’ పత్రిక ప్రకటించిన అతిపెద్ద 500 కంపెనీల్లో ఎనిమిది భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. వీటిలో ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లకు మొదటి 100 కంపెనీల్లో స్థానం దక్కింది. వీటి వార్షిక ఆదాయం 86,016 మిలియన్ డాలర్లు.
గత సంవత్సరం 98వ స్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్ ఈసారి 83 స్థానానికి, 134వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 99వ స్థానానికి చేరాయి. వీటితో పాటు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కిన భారతీయ కంపెనీల జాబితాలో టాటా స్టీల్(401వ స్థానం), టాటా మోటార్స్(314వ స్థానం), భారత్ పెట్రోలియం(225వ స్థానం), హిందుస్థాన్ పెట్రోలియం( 267వ స్థానం), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ 357వ స్థానం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(285వ స్థానం) ఉన్నాయి. ఈ జాబితాలో రాయల్ డచ్ షెల్ మొదటిస్థానంలో ఉంది.
భారత్‌పై ఐరాస సహస్రాబ్ధి అభివృద్ధి నివేదిక
భారతదేశంలో 626 మిలియన్ల మంది జనాభాకు మరుగుదొడ్డి సౌకర్యం లేదని ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ధి అభివృద్ధి నివేదిక -2012 పేర్కొంది. ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికమని తెలిపింది. 2011 జూన్ చివరి నాటికి దేశంలోని 98.1 శాతం గ్రామాలకు మొబైల్ ఫోన్ సౌకర్యం అందుబాటులోకి వ చ్చిందని నివేదిక పేర్కొంది.
అయితే ప్రపంచంలో 1.1 బిలియన్ మందికి (15 శాతం జనాభాకు) పారిశుధ్య సౌకర్యాలు లేవని, భారత్‌లో కూడా ఇవి చాలా తక్కువగా మెరుగుపడ్డాయని తెలిపింది. సహస్రాబ్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే పారిశుధ్య సౌకర్యాలు లేని వారి సంఖ్యను 2015 నాటికి 38 శాతానికి తగ్గించాల్సి ఉందని అభిప్రాయపడింది. 2011 చివరి నాటికి ప్రపంచంలో 35 శాతం మంది జనాభాకు ఆన్‌లైన్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని నివేదిక తెలిపింది.
యూఎన్‌డీఓఎఫ్ అధిపతిగా ఇక్బాల్ సింగ్
సైనిక దళాల ఉపసంహరణ ను పర్యవేక్షించే ఐక్యరాజ్యసమితి సేనకు(యూఎన్‌డీఓఎఫ్) అధిపతిగా భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ ఇక్బాల్ సింగ్ సింఘా నియమితులయ్యారు. ఫిలిప్పీన్స్ మేజర్ జనరల్ నటాలియో సి. ఎకర్మ స్థానంలో సింగ్ బాధ్యతలు స్వీకరిస్తారు.

Total Pageviews

1067689

Template Information

Template Information